కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జగన్ ఒక్కడి ఖర్చు రూ.120 కోట్లు, ఎన్నికలు వద్దు వేలం పాడాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Modugula Venugopal Reddy
గుంటూరు: కడప, పులివెందులలో జరిగిన ఉప ఎన్నికలలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన గెలుపు కోసం సుమారు 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఉప ఎన్నికలలో మద్యం, డబ్బు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయని అన్నారు. ఉప ఎన్నికలు సజావుగా జరగలేదన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలం అయిందన్నారు. ఉప ఎన్నికలలోనే ఇంత ఖర్చు పెట్టిన జగన్ వచ్చే ఎన్నికలలో అన్ని స్థానాలు కొనేసినా ఎవరూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికలు పూర్తిగా అక్రమాలకు నిలయమై పోయినప్పుడు ఇక ఎన్నికలకు విలువ ఏమి ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును వేలంపాట ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వేలంపాట నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని తాను కోరతానని చెప్పారు.

English summary
Telugudesam Party MP Modugula Venugopal Reddy blamed Ex MP YS Jaganmohan Reddy's attitude today in Kadapa bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X