వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదిన వైయస్ విజయమ్మపై పులివెందులలో వైయస్ వివేకాకు ఓటమే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో తన వదిన వైయస్ విజయమ్మపై తనకు ఓటమి తప్పదని కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. వైయస్ వివేకానంద రెడ్డి, కడప లోకసభ కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిలతో పాటు కడప కాంగ్రెసు నాయకులు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఉప ఎన్నికల తీరుపై, ఓటింగ్ సరళిపై వారు ముఖ్యమంత్రికి వివరించారు. పులివెందులలో వివేకానంద రెడ్డి ఆరేడు శాతం ఓట్ల తేడాతో ఓడిపోతారని వారు చెప్పినట్లు తెలుస్తోంది. మొదట్లో అనుకూలంగా ఉన్నా చివరి నిమిషంలో సెంటిమెంటును బలంగా రెచ్చగొట్టారని, డబ్బులు పంచారని, దాంతో వివేకానంద రెడ్డికి ఫలితం ప్రతికూలంగా మారిందని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.

కాగా, కడప లోకసభ స్థానంలో డిఎల్ రవీంద్రా రెడ్డి 17 శాతం ఓట్ల తేడాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై ఓడిపోయే అవకాశాలున్నట్లు వారు చెప్పారు. అయితే, తేడా 14, 15 శాతం మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు డబ్బులు పెద్ద యెత్తున పంచారని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు ఆరోపించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలుస్తారని తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రకటనపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ సర్వేలో వాస్తవం లేదని, అంత భారీ తేడా ఉండదని ముఖ్యమంత్రి అన్నట్లు చెబుతున్నారు.

English summary
Congress candidate YS Vivekanda Reddy ageed his defeat in Pulivendula assembly segment on YSR Cobgress candidate YS Vijayamma. He along with Congress lokasabha candidate DL Ravindra Reddy met CM Kirankumar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X