కడప: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి రెండో స్థానంలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె రెండు మూడు వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. పులివెందుల శాసనసభా స్థానానికి ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ విజయమ్మపై వెనకబడిపోయారు.
కడప లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగన్ 24 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.