Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉప ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: కడప ఉప ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని, అలా తీసుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ బలహీనపడలేదని ఆయన అన్నారు. కడప జిల్లాలనే కాదు, అన్ని జిల్లాల్లోనూ పార్టీ పునాదులపై దృష్టి పెడతామని ఆయన అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తాము తొలగించలేకపోయామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తాము గట్టిగా తిప్పికొట్టలేకపోయామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై, పార్టీపై ప్రజల విశ్వసనీయతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి, పార్టీ నాయకత్వానికి చెబుతానని ఆయన అన్నారు. సెంటిమెంట్ బలంగా పనిచేసే ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+