గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని చక్కదిద్దగలరా?

పార్టీ నాయకులతో, మంత్రులతో, శానససభ్యులతో ఉమ్మడిగానూ విడివిడిగానూ చర్చించడానికి ఆయన సిద్ధపడ్డారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోలేనంతగా పార్టీ నాయకత్వం బలహీనపడిందనే అభిప్రాయం నెలకొని ఉంది. తమపై చర్య తీసుకునే దమ్ము పార్టీకి లేదని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ఇక, తెలంగాణ సమస్య పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం తప్ప మరోటి తమకు వద్దని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్టీ సీమాంధ్ర నాయకులు అంటున్నారు. ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆజాద్కు సవాలే.
ఇకపోతే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులోనే పరిస్థితి బాగా లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు. వారు ఆజాద్కు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు కూడా చేశారు. సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చి పార్టీని ఏకతాటిపైకి ఆజాగ్ తేలగలరా అనేది ప్రశ్న.












Click it and Unblock the Notifications