భూములు లాక్కుని రైతులపై మొసలి కన్నీరు: వైయస్ జగన్‌పై విహెచ్

V Hanumanth Rao
హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)ల పేరుతో రైతుల భూములు లాక్కున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. దీక్షల పేరుతో రైతులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సెజ్‌ల పేరు చెప్పి రైతుల భూములను వైయస్ జగన్ తక్కువ ధరకు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులు మైనింగ్, సెజ్‌ల పేరుతో కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. భూములు లాక్కున్నప్పుడు జగన్‌కు రైతులు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనక నుంచి కథ నడిపించింది జగన్ కాదా అన ఆయన అడిగారు. వైయస్ కుమారుడిగా భూములు లాక్కున్నది జగన్ కాదా అని ఆయన అడిగారు. లక్షల మెజారిటీ వచ్చిందని విర్రవీగుతూ కడప పౌరుషం గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేసిన విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. బ్రాహ్మమి స్టీల్స్ కర్మాగారాన్ని స్థాపిస్తామని పది వేల ఎకరాలు తీసుకుని, ఇప్పుడు వెనక్కి తగ్గి కడప ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ కోసం ఓబుళాపురం గనులను తీసుకుని, ఇనుప ఖనిజాన్ని ఇతర దేశాలకు అమ్ముకుని కోట్లు గడించారని, ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టబోమని అంటున్నారని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. అనంతపురంలో స్థాపించదలిచిన సైన్స్ సిటీ ఏమైందని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+