స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేసిన భర్త

పోలీసులు అనంతలక్ష్మి భర్త నిరంజన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో తానే అనంతలక్ష్మిని హత్య చేశానని నిరంజన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గొడవల కారణంగానే ఈ ఘాతుకం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి అనంతలక్ష్మిని నిరంజన్ హత్య చేశాడని అంటున్నారు.
పెళ్లయిన మూడు నెలల తర్వాత ఆమెను పుట్టింటికి పంపించాడు. ఇటీవల ఆమెకు ఫోన్ చేసి రావాలని పిలిచాడు. అత్తగారింటికి వెళ్లి అనంతలక్ష్మిని తీసుకొచ్చాడు. ఆమెను ఉమెన్ హాస్టల్లో ఉంచాడు. ఈ నెల 20వ తేదీన ఆమెను కారులో తీసుకుని వెళ్లాడు. అక్కడే స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అతనికి అనంతలక్ష్మి తల్లిదండ్రులు కోటి రూపాయలు కట్నం ఇచ్చాడు.












Click it and Unblock the Notifications