హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం జనార్దన్ రెడ్డి వైయస్ జగన్‌కు అమ్ముడు పోయారు: మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు అమ్ముడు పోయారని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. వారిద్దరు జగన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ వద్ద డబ్బులు తీసుకుని నాగం జనార్దన్ రెడ్డి తమ ప్రాంత శాసనసభ్యులను పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అన్ని పదవులు అనుభవించిన నాగం జనార్దన్ రెడ్డి పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన అన్నారు.

నాగం జనార్దన్ రెడ్డిపై వేటు వేయాలని పార్టీకి లేదని, వేటు వేయించుకునేలా నాగం జనార్దన్ రెడ్డే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ అవసరాల కోసం నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో చేతులు కలిపి తెలంగాణను నాగం జనార్దన్ రెడ్డి మోసం చేశారని, అప్పటి మాదిరిగా తన రాజకీయావసరాల కోసం ఎవరినైనా బలి పెట్టడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడ్డారని ఆయన అన్నారు.

తాము తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు కలిసి వస్తే తాము వారితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు రాజీనామా చేయడానికి ముందుకు వస్తే తాము కూడా రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తెద్దామని, సోనియా ఇంటి ముందు ధర్నా చేద్దామని ఆయన అన్నారు.

English summary
TDP Telangana region MLA Mothkupalli Narasimhulu lashed out at his party MLA nagam Janardhan Reddy on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X