నాగం జనార్దన్ రెడ్డిపై వేటుకు తెలుగుదేశం రంగం సిద్ధం

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్తో చర్చించేందుకు రేపు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత రేపు సాయంత్రం గానీ, ఎల్లుండి బుధవారం ఉదయం గానీ పార్టీ పోలిట్బ్యూరో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డిపై తీసుకునే చర్యలపై నిర్ణయం జరుగుతుందని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇస్తారా, ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది తెలియడం లేదు.
ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ మాహానాడు జరగనుంది. మహానాడుకు ముందు నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా, తర్వాత తీసుకుంటారా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. సోమవారం నాడు మరో తెలంగాణ ప్రాంత శానససభ్యుడు హరీశ్వర్ రెడ్డి తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతూ పార్టీ తెలంగాణ ఫోరానికి బహిరంగ లేఖ రాశారు. అయితే, హరీశ్వర్ రెడ్డిపై ప్రస్తుతానికి చర్యలు ఉండకపోవచ్చునని అంటున్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications