రోశయ్య ఇంటికి ముఖ్యమంత్రి కిరణ్: అమీర్ పేట వ్యవహారంపై చర్చ
దాంతో పాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానానికి సవాళ్లు విసురుతున్న వేపథ్యంలో శాసనసభ్యుడిగా చాలా అనుభవం ఉన్న రోశయ్యను విశ్వాస తీర్మానంపై సలహాలు అడిగినట్లుగా సమాచారం. సభాపతి, శాసనమండలి చైర్మన్ తదితర పదవుల భర్తీపై రోశయ్య సలహాలు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ సీనియర్లతో కలిసి వెళ్లడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి తన పద్ధతి మార్చుకుని సీనియర్ల సలహాలు తీసుకునేందుకు ఉద్యుక్తుడవుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం కూడా గవర్నర్ నరసింహన్తో సమావేశం అయిన విషయం తెలిసిందే.
Comments
kiran kumar reddy rosaiah narasimhan congress hyderabad కిరణ్ కుమార్ రెడ్డి రోశయ్య నరసింహన్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
CM Kiran kumar Reddy went to former CM Rosaiah residence and talk about Ameerpet land scam and delhi tour.
Story first published: Thursday, June 2, 2011, 12:02 [IST]