ప్రభుత్వాన్ని కూల్చుతామని జగన్ అనలేదు: కొణతాల రామకృష్ణ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను నీరుగార్చుతున్న కాంగ్రెసు ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సమర్థిస్తుందని చెప్పారు. తమ పార్టీకి ఒకరే ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. జగన్కు మద్దతు తెలుపుతున్న వారంతా కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అని వారు ఎవరికి మద్దతు ఇస్తారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు తమ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు. మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి అవిశ్వాసం పెట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా పెట్టారా లేదా అనే విషయం మరో నాలుగు రోజుల్లో తెలుస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications