హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏదో ఒక నిర్ణయం తీసుకొండి: జగన్ వర్గం ఎమ్మెల్యేలకు బొత్స క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు నీరజారెడ్డికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు నీరజారెడ్డి ఉదయం పిసిసి చీఫ్ బొత్సను కలిశారు. ఈ సందర్బంగా ఆయన రెండు పడవలపై కాలు మంచిది అని సూచించినట్టుగా తెలుస్తోంది. అటు జగన్‌తో వెళ్లడం, ఇటు కాంగ్రెసు పార్టీలో ఉండటం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా భవిష్యత్తు బావుండదని త్వరగా ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఆమెకు సూచించినట్లుగా తెలుస్తోంది.

జగన్‌తో వెళ్లడమా, కాంగ్రెసులో ఉండటమా అనే నిర్ణయం తనపైనే ఆధారపడి ఉందని ఆమెకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ జాతీయస్థాయి పార్టీ అని ఉంటే భవిష్యత్తు ఉంటుందని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా కాంగ్రెసులో బొత్సా ఉత్సాహం కనిపిస్తోంది. బొత్స పిసిసి ఛీఫ్‌గా ఎన్నికైనప్పటి నుండి జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వచ్చి కలుస్తున్నారు. కాగా తాను జిల్లా కమిటీల అంశంపై బొత్సను కలిసినట్లు నీరజారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana take class to YSR Congress camp MLA Neeraja Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X