వైయస్ జగన్కు మాట్లాడే అర్హత లేదు, బొత్స మద్యం వ్యాపారి: చంద్రబాబు

అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అధిష్టానానికి రాసిన లేఖకు పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ అవసరం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలను శాసించలేరన్నారు. బిజెపితో పాటు కాంగ్రెసు కూడా మతసామరస్యాన్ని కాపాడాలని సూచించారు. అకాల వర్షాలు పడి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితులో అధికార కాంగ్రెసు ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేతకాని, పనికిరాని ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రైతాంగ సమస్యలపై టిడిపి పలు ఆందోళనలు చేపట్టిందని గుర్తు చేశారు.
అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. గోదాముల్లో ధాన్యం నిలువలు పెరిగాయన్నారు. రైతులకు విత్తనాలు దొరకని పరిస్తితి ఏర్పడిందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున ఓ కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు కనీసం తిండిలేకుండా బతుకుతున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అల్పసంఖ్యాక వర్గాలను ముందుకు తీసుకు పోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications