బొత్స సత్యనారాయణకు చిరంజీవి సలహాలు, పట్టుకు ప్రయత్నాలు

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో పట్టుకు గత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సహకారం అందిస్తూ తాను సహకారం పొందే దిశగా ఆయన పనిచేస్తున్నట్లు సమాచారం. పార్టీపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న బొత్స సత్యనారాయణకు చిరంజీవి సలహాలు కూడా ఇస్తున్నారని అంటున్నారు. పరస్పర సహకారంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలని వారు చూస్తున్నారని చెబుతున్నారు.

కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపినా ఇరు పార్టీల పరంగా విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. విలీన సభను భారీ యెత్తున నిర్వహించాలని చిరంజీవి భావిస్తున్నారు. తిరుపతిలో విలీన సభ జరపాలని తనకు ఉన్నట్లు చిరంజీవి ఇటీవల తన మనోగతాన్ని బయటపెట్టారు. అయితే, రాజమండ్రిలో గానీ విజయవాడలో గానీ ఆ సభను నిర్వహించినా ఫరవా లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. జులై 10, ఆగస్టు 15వ తేదీ మధ్య కాలంలో విలీన సభ జరగాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారు.

విలీన సభ బొత్స సత్యనారాయణ తడాఖాను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ అధిష్టానానికి చూపించే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ గాడిలో పడిందనే సందేశాన్ని విలీన సభ ద్వారా ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను దారికి తేవడమో, వారిపై చర్యలు తీసుకోవడమో చేయాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, విలీనసభకు బొత్స అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+