భూమి స్వాధీన వివాదం: రైతు ఆత్మహత్య యత్నం

Rangareddy District
హైదరాబాద్: భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన ఎపిఐఐసి అధికారులకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల చర్యను నిరసిస్తూ గోపాల్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మిగతా రైతులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతులతో చర్చలకు ముందుకు వచ్చారు.

పోలీసుల అండదండలతో ఎపిఐఐసి అధికారులు మహేశ్వరం మండలంలోని కెసి తండాలో 350 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారిని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పక్షాలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తమకు ముందుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు పట్టుబట్టారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను స్వాధీనం చేసుకుంటామని ఎపిఐసిసి తమతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+