చర్చల ప్రక్రియ వెల్లడించేది కాదు: తెలంగాణపై ఆజాద్

తెలంగాణ అంశంపై తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతామని ఆయన అన్నారు. సంప్రదింపుల కమిటీ ఖరారు కాలేదని, మరో కమిటీని గానీ మరో సమన్వయ కమిటీని గానీ వేసే ఉద్దేశం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై తమ కోర్ కమిటీ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ నివారణకు ఏ విధమైన చర్యలూ చేపట్టలేదని ఆయన చెప్పారు.
కాగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications