ఎంపి కృపారాణి తనయుడిపై లైంగిక వేధింపుల కేసు

బాధితురాలైన విద్యార్థినికి టెక్కలి శాసనభ్యురాలు కొర్ల భారతి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మద్దతుతో విద్యార్థిని పోలీసు స్టేషన్లో క్రాంతిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టించారని తెలుస్తోంది. కాగా ఎంపీ కృపారాణి తనయుడు క్రాంతిపై ఆరోపణలు కొత్తగా రాలేదు. గతంలో కూడా చాలాసార్లు క్రాంతిపై ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ జర్నలిస్టుపైన సైతం క్రాంతి చేయి చేసుకున్నట్లు సమాచారం.
కాగా టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి అండతోనే తన తనయుడు క్రాంతిపై టెక్కలి పోలీసు స్టేషన్లో అక్రమంగా కేసు బనాయించారని ఎంపీ కృపారాణి అంటోంది. తన తనయుడు ఏ అమ్మాయిని వేధించలేదని చెబుతోంది. రాజకీయ కక్షతోనే భారతి తన తనయుడిపై అమ్మాయిని వేధిస్తున్నారనే కేసు పెట్టించిందని ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications