వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సును ఢీకొన్న రైలు, 37 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Trains Accident
లక్నో‌: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చాప్రా మథుర ఎక్స్‌ప్రెస్ రైలు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని కాంశీరాం జిల్లాలో సంభవించిన ఈ ప్రమాదంలో 37 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. లక్నోకు 250 కిలోమీటర్ల దూరంలో గల థనగావ్ వద్ద మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఇప్పటి వరకు తాము 37 మంది మరణించినట్లు గుర్తించామని, ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని కాంశీరాం జిల్లా మెజిస్ట్రేట్ సెల్వ కుమారి జె మీడియా ప్రతినిధులతో చెప్పారు. గాయపడినవారిని కాంశీరాం నగర్, ఈటా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చేర్చారు. క్షతగాత్రులకు చికిత్స చేయడంలో రైల్వే వైద్యులు కూడా స్థానిక వైద్యులకు సహకరిస్తున్నారు.

English summary
At least 37 people were killed and over 30 injured when the Chhapra Mathura express train collided with a bus carrying members of a marriage party near Kanshiram Nagar district in Uttar Pradesh early Thursday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X