కాంగ్రెసు, టిఆర్ఎస్ను ఇరుకున పెడుతున్న టిడిపి
రాజీనామాలు చేయకుముందు నుండి ఇప్పుడు నిర్వహిస్తున్న బస్సుయాత్ర వరకు టిడిపి మళ్లీ పోటీ చేయకూడదని కాంగ్రెసు, టిఆర్ఎస్లకు సవాల్ విసురుతూ వారిని ఇరుకున పెట్టే స్థితికి చేరుకుంది. రాజీనామాలకు ముందు పూర్తిగా కనుమరుగైన టిడిపిలో రాజీనామాల తర్వాత కొత్త ఊపు కనిపిస్తుండటం, బస్సుయాత్రకు ప్రజలు భారీగా తరలి వస్తుండటంతో రాజకీయ పరిశీలకులు సైతం టిడిపి పుంజుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణ కోసమంటూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోయి మళ్లీ వారే గెలుపొందటం వల్ల ఉపయోగం లేదని, ఇప్పటికే టిఆర్ఎస్ పలుమార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయి సాధించిందేమీ లేదని టిడిపి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
English summary
Congress and Telangana Rastra Samithi in crisis with Telugudesam party attitude.
Story first published: Thursday, July 14, 2011, 9:01 [IST]