జై ఆంధ్ర ఉద్యమం చేపడతాం: బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి

Kishan Reddy
హైదరాబాద్: సీమాంధ్రలో త్వరలో జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట నియోజకవర్గం శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రత్యేకాంధ్ర కోసం త్వరలో ఆందోళనలు చేపడతామని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. సీమాంధ్రులు కేవలం భద్రత కోసమే భయపడుతున్నారని అన్నారు. భయపడుతున్న సీమాంధ్రులకు భద్రత కల్పిస్తామని చెప్పారు.

భద్రత పట్ల భయపడుతున్న వారి అనుమానం నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులకు అండగా నిలుస్తామని అన్నారు. ముంబయి పేలుళ్ల వెనుకు రాష్ట్రీయ స్వయం సేవక్ హస్తం ఉండి ఉండవచ్చునన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవాస్తవ ఆరోపణలు చేసిన దిగ్విజయ్ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+