వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే వేదిక మీదికి ఇరు ప్రాంతాల నేతలు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలను ఒకే వేదిక మీదికి తేనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర, విభజన అనే రెండు అంశాలపై ఉమ్మడి వేదిక మీద చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. చర్చల్లో ప్రస్తుతానికి హైదరాబాద్ అంశం లేదని ఆయన చెప్పారు. రాష్టంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనేది తమ పార్టీ అధిష్టానం ఆలోచన అని, ఈ చర్చల ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు విడివిడిగా ఎవరి మనోభావాలను వారు వ్యక్తీకరిస్తున్నారని, ఎదుటి వారి మనోభావాలను పట్టించుకోవడం లేదని, అందువల్ల ఇరు ప్రాంతాల నాయకులు ఒకే వేదిక మీదికి వస్తే పరస్పర అవగాహనకు అవకాశం కలుగుతుందని, తద్వారా పరిష్కార మార్గాన్ని కేంద్ర ప్రభుత్వానికీ పార్టీ అధిష్టానానికీ విన్నవించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. తాను తెలంగాణ నాయకులతో, సీమాంధ్ర నాయకులతో జరిపిన చర్చలు వివరాలను ఆజాద్‌కు వివరించానని, తాజా పరిస్థితులను కూడా చెప్పానని ఆయన అన్నారు. పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఇతర పార్టీల గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది యుపిఎ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రాజీనామాలపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆలోచించుకుని, నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X