Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎపి భవన్ వద్ద తెలంగాణవాదుల ధర్నా, ఉద్రిక్తత

K Keshav Rao
న్యూఢిల్లీ: ఎపి భవన్ దగ్గర గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ కోసం బుధవారం పార్లమెంటు సమీపంలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు వస్తామని చెప్పి నేరుగా విమానాశ్రయానికి తరలించడంపై భారతీయ జనతా, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు ఎపి భవన్ రెసిడెంటల్ కమిషనర్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు వస్తామని చెప్పి విమానాశ్రయం తీసుకు పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు ఎంపీలు కె కేశవరావు, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మంద జగన్నాధం, వివేక్, రాజయ్య, కాంగ్రెసు ఎమ్మెల్యేలు దామోదర రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజయ్య, గండ్ర వెంకటమణారెడ్డి, టిఆర్ఎస్ శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలుగుదేశం పార్టీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆందోళనకు దిగారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు రాకుండా అడ్డుకున్న కమిషనర్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ ఎక్కడైనా పోరులో ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి. కానీ తెలంగాణ పోరులో మా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ కోసం యువకులు ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన కోరారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు రాక పోవడం శోచనీయం అన్నారు. హరీష్ రావు, ఈటెల మాట్లాడుతూ కమిషనర్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎపి భవన్ కమిషనర్ తీరుపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+