బొత్స సత్యనారాయణకు చిక్కులు, క్షమాపణ

పుస్తకంలో ప్రచురించిన అనుచిత చిత్రాలకు బొత్స సత్యనారాయణ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చిత్రాలు ప్రచురించడం సంప్రదాయం కాదని ఆయన అన్నారు. మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆ చిత్రాలు ఉన్నాయని, అటువంటి చిత్రాలు ప్రచురించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నాయకులు పరస్పరం రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ చర్చల్లో పాల్గొనాలని తాను సీమాంధ్ర నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications