వైయస్ను సిఎంగా జగన్ దించేసేవారు: లగడపాటి

వైయస్ రాజమండ్రిలో మంచాన పడినప్పుడు కనీసం పలకరించటానికి జగన్ రాలేదని, 2004 ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకం లేనందునే జగన్ పోటీ చేయలేదని, గెలిచిన తర్వాత రాజీనామా చేయాల్సిందిగా బాబాయి వివేకానంద రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్ సీఎం అవుతారనుకున్నామని, కానీ పార్టీ గుండెల్లో గునపం గుచ్చుతారనుకోలేదని లగడపాటి వ్యాఖ్యానించారు. ఒకవైపు సోనియాను దారుణంగా విమర్శిస్తూ, మరోవైపు వైయస్ వారసుడినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
వైయస్పై అభిమానంతో జగన్ వద్దకు చేరిన వారంతా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాయలో నుంచి బయటపడుతున్నారని లగడపాటి అన్నారు. జగన్పై సీబీఐ విచారణతో కాంగ్రెస్కు సంబంధం లేదని, అది మంత్రి శంకర్రావు వ్యక్తిగతంగా చేసిన ఫిర్యాదని ఆయన అన్నారు. కానీ, కొంత మంది కావాలని పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, సీబీఐపై ఎలాంటి ఒత్తిడీ లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications