హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేల సీట్లలో ఇంచార్జీలు, బొత్స ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్తున్న తమ పార్టీ శాసనసభ్యులను రాజకీయంగా ఎదుర్కోవాలని ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ వెంట వెళ్తున్న శానససభ్యులు వెనక్కి రాకపోతే వారిని రాజకీయంగా దెబ్బ తీయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన జిల్లాల పర్యటనలో అందుకు శ్రీకారం చుట్టాలని ఆయన భావిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ తర్వాత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆయన తన పర్యటన మొదలు పెట్టే అవకాశాలున్నాయి.

అన్నవరంలో బొత్స సత్యనారాయణ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతారు. జిల్లా పర్యటనల సందర్భంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లా నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. జగన్ వర్గం శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్న శాసనసభా నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇంచార్జీలుగా నియమితులైనవారికే టికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

English summary
It is learnt that Botsa Satyanarayana has decided appoint incharges for assembly segments, representing YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X