తెలంగాణ వ్యతిరేకులకు సేవలు బంద్: కోదండరామ్

తెలంగాణ ప్రజల జై తెలంగాణ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలన్నారు. సకల జనుల సమ్మె అంటే కేవలం ఉద్యోగుల సమ్మె కాదన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ పాలనకు సహకరించాలన్నారు. తెలంగాణ ప్రజలంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం కోసమే సకల జనుల సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. సహాయ నిరాకరణ కేవలం తెలంగాణ వ్యతిరేకులకే అని చెప్పారు. ప్రయివేటు స్కూళ్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని చెప్పారు. సమ్మెలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావుకు చుక్కెదురయింది.












Click it and Unblock the Notifications