హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యపై స్వామి గౌడ్, జూపల్లి కృష్ణా రావు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి విరామం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు తప్పు పట్టారు. జయశంకర్ మరణించిన తర్వాత కూడా ఉద్యమం ఆగలేదని, సోనియా అస్వస్థత వల్ల ఆగాల్సిన అవసరం లేదని స్వామి గౌడ్ శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రోశయ్య ప్రకటన ఉద్యమాన్ని అణచివేసే కుట్ర అని ఆయన విమర్శించారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రోశయ్య తెలంగాణకు వ్యతిరేకులని ఆయన అన్నారు. సోనియా త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటూనే కోర్ కమిటీ తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఎల్లుండి నుంచి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయాలని ఆయన సూచించారు.

English summary
Telangana employees unions leader Swamy Goud and ex minister from Telangana opposed former CM Rosaiah's suggestion on Telangana movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X