హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు చెక్: వారసులకు బొత్స గాలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కళ్లెం వేసే కార్యాచరణకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నడుం బిగించారు. వివిధ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయన సోమవారం మంతనాలు జరిపారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల కుమారులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఉంటున్నప్పటికీ వారి బంధుమిత్రులు, సంతానం వైయస్ జగన్ వెంట వెళ్తున్న పరిమాణాన్ని గ్రహించి, దానికి బ్రేకులు ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ వారితో చర్చలు జరిపారు.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఏరాసు ప్రతాపరెడ్డి, ముఖేష్ గౌడ్, విశ్వరూప్‌ల కుమారులు కార్తిక్ రెడ్డి, ఫణీంద్ర, రామ్ మనోహర్ నాయుడు, అరవింద రెడ్డి, విక్రమ్ గౌడ్, కృష్ణలతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అలాగే పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్, శానససభ్యులు నందీశ్వర్ గౌడ్, రాజేంద్రల కుమారులు అనిల్ కుమార్ యాదవ్, ఆశిష్, శ్రావణ్‌లతో కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మరో పదిహేను రోజుల్లో అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకుల వారసులతో మాట్లాడాలని బొత్స సత్యనారాయణ నిర్ణయించుకున్నారు.

తమకు బొత్స సత్యనారాయణ ఏ విధమైన హామీలు ఇవ్వలేదని, పార్టీకోసం పనిచేస్తామని, అప్పుడు గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నామని, పార్టీలో ఉన్నప్పుడు జగన్ వెంట తిరిగామని, పార్టీని వీడిన తర్వాత జగన్‌ను కలవడం లేదని సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana is in a bid to woo sons of ministers, MLAs and parliament members, who are seeing at YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X