రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి: ఉత్తర ప్రదేశ్‌లో రైతుల గురించి మాట్లాడుతున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి రాష్ట్రంలోని రైతుల పరిస్థితి కనిపించడం లేదా అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ప్రశ్నించారు. రాష్ట్ర రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగ సమస్యలపై జాతీయ నేతలను కలిసి వారి మద్దతు కోరామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాటం ఆగదన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలని అన్నారు. రైతుల తరఫున టిడిపి పోరాటం చేస్తుందన్నారు.

కాంగ్రెసు హయాంలో విచ్చలవిడి అవినీతి చోటు చేసుకుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయాయని అన్నారు. అవినీతిపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు. గతంలో టిడిపి అవినీతిపై పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందన్నారు. టిడిపి హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. అవినీతి నిర్మూలించాలంటే పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు తీసుకు రావాలని అన్నారు. రైతాంగ సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. సెజ్‌ల పేరుతో కాంగ్రెసు ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ధ్వజమెత్తారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu blamed AICC general secretary Rahul Gandhi for state agriculture issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X