హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తులపై కేసు నమోదుకు సిబిఐ రెడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై, ఎమ్మార్ ప్రాపర్టీస్‌పై రేపో, మాపో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ న్యూఢిల్లీ వెళ్లారు. జగన్, ఎమ్మార్ కేసులపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. జగన్, ఎమ్మార్ కేసు విచారణపై సిబిఐ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.

న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం కేసు నమోదుపై సిబిఐ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తును సమర్పించిన అనంతరం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జగన్ ఆస్తులు, ఎమ్మార్ అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తి దర్యాఫ్తు చేయాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా జగన్ సైతం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతానని ప్రకటించారు.

English summary
CBI may booked case against YSRC party president Jaganmohan Reddy's property and EMAAR soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X