కిరణ్ కుమార్ ప్లాన్, వైయస్ ఇమేజ్‌ను తుడిచేస్తూ..

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్‌ను తుడిచేస్తూ తన ఇమేజ్‌ను పెంచుకునే రహస్య వ్యూహాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్నారు. ఇందుకు తగిన పథకాన్ని ఆయన సిద్ధం చేశారు. దాన్ని అమలులో కూడా పెట్టారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఆయన అసలు ప్రస్తావించడం లేదు. స్వాతంత్ర్య దినోత్వస వేడుకల్లో వైయస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను వివరించినప్పటికీ వైయస్సార్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన ఆ పని చేశారని అంటున్నారు. వైయస్సార్ పేరు కాంగ్రెసుకు ఏ మాత్రం ఉపయోగపడదని, పైగా తన వైయస్సార్‌ను ప్రస్తావిస్తే తన ఇమేజ్ పెరగదని ఆయన భావించినట్లు సమాచారం.

అదే సమయంలో తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి వ్యూహాలు రచించారు. సంబంధిత మంత్రులకు తెలియకుండా వాటిని అమలు చేస్తున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డికె అరుణకు తెలియకుండా ఆయన తన పథకాలను అమలు చేస్తున్నారు. తన భారీ చిత్రాలతో ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇందుకు సమాచార శాఖ నుంచి 27 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వాల్ రైటింగ్స్ కూడా చేయించాలని ఆయన నిర్ణయించుకుని అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు దాదాపు 180 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు.

ఇక మరో వ్యూహం కూడా ఆయన మదిలో ఉంది. 108 సేవలు అందిస్తున్న వాహనాలపై తన ఛాయాచిత్రాన్ని ముద్రించే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసేలా చేసుకోవాలనేది కిరణ్ కుమార్ రెడ్డి ప్లాన్‌గా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+