వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగంపై స్పీకర్ సీరియస్, హక్కుల ఉల్లంఘన నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla manohar
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై, ఆ పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. వారిద్దరికి ఆయన మంగళవారం సభా హక్కుల నోటీసు జారీ చేశారు. వారంలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆయన వారిని ఆదేశించారు. స్పీకర్ కనిపించడం లేదని నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా తీసుకున్న నాదెండ్ల మనోహర్ ఆ ఇద్దరు శాసనసభ్యులు స్పీకర్‌ను అగౌరవపరిచారని భావించారు. దీంతో సభా హక్కుల నోటీసు జారీ చేశారు.

కాగా, స్పీకర్ నోటీసులకు బెదిరేది లేదని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. స్పీకర్ తమను భయపెట్టలేరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్ తెలంగాణ స్పీకర్ కాదా అని ఆయన అడిగారు. ఉరి తీస్తారా అని ఆయన అడిగారు. వంద మంది శానససభ్యులు రాజీనామాలు చేస్తే ఎవరితోనూ మాట్లాడకుండా వాటిని తిరస్కరించి స్పీకర్ విదేశాలకు వెళ్లారని ఆయన అన్నారు. రాజీనామాలను ఆమోదించలేదనే ఆగ్రహంతో తాము పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో హరీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

English summary
Assembly speaker Nadendla manohar issued notices to Telangana MLAs Nagam Janardhan Reddy and Hariswar Reddy under prevlige.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X