వైయస్ జగన్ కోర్టులోకి హెలికాప్టర్ ప్రమాదం?

YSR Helicopter Crash
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై వైయస్సాఆర్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ జగన్‌పై ఎదురుదాడికి దిగేందుకు సన్నద్దమైనట్లుగా కనిపిస్తోంది. జగన్ కాంగ్రెసును వీడి బయటకు వచ్చాక జగన్‌తో సహా ఆయన వర్గం నేతలంతా వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు నేతలు ప్రమాదంలో కాంగ్రెసు పెద్దల హస్తం ఉందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ చేసిన దర్యాఫ్తు కూడా తప్పుల తడక అని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై జగన్ వర్గం నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కాంగ్రెసు నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన సమాధానం రాలేదు.

కేవలం ఆ వ్యాఖ్యలు కొట్టి పారేసే ప్రయత్నాలు మాత్రమే చేశారు. అయితే ప్రమాదంపై కాంగ్రెసు ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగే నాటికి ఏవియేషన్ కార్పోరేషన్ ఎండిగా వైయస్‌కు దగ్గరి వ్యక్తిగా భావిస్తున్న బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. దీంతో వైయస్ ప్రమాదం విషయంలో ఆయనను టార్గెట్ చేసుకునేందుకు కాంగ్రెసు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. బ్రహ్మానందరెడ్డి ఎండిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన కారణంగా జగన్‌కు చెక్ చెప్పేందుకు ఆయనపై చర్యలకు కాంగ్రెసులోని కొందరు నేతలు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ప్రధానంగా వైయస్ హెలికాప్టర్ ప్రమాదం చర్చకు వచ్చింది.

ఆ సమయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. వైయస్ లాంటి మహానేత మృతి విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అయినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం సమయంలో ఎండీగా ఉన్న బ్రహ్మానందరెడ్డి తీరును సిబిఐతో పాటు మరో రెండు కమిటీలు తప్పుపట్టాయని అయినప్పటికీ ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి రఘువీరా రెడ్డి సైతం వైయస్ వెళ్లే సమయంలో అగస్టా వెస్ట్‌ల్యాండును రెడీ చేయకుండా హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న నాలుగు గంటలలోనే ఎలా సిద్ధం చేశారని ప్రశ్నించారు. అంతకుముందుగానే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేయగానే అగస్టాకు ఎందుకు మరమ్మతులు చేయలేదని అధికారులను నిలదీశారు. మంత్రులు శైలజానాథ్, మహీధర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని మళ్లీ జగన్ వర్గం కోర్టులోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+