చనిపోయే ముందు షాకింగ్ నిర్ణయం: ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చిన సీనియర్ నటుడు!
పదేళ్ల క్రితం తెలుగు సినిమా రంగంలో అత్యంత అభిమానించే నటులలో ఒకరు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో యావత్ తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కానీ అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఆయన చివరి కోరిక. ఆ నటుడు తన పిల్లలతో సహా కుటుంబానికి ఏమీ ఇవ్వకుండా తన ఆస్తి మొత్తాన్ని తన ఇంట్లో పనిచేసేవారికి రాసిచ్చినట్లు సమాచారం. 2015 డిసెంబర్ 19న 66 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకునే ముందు ప్రముఖ నటుడు రంగనాథ్.. తన మృతదేహం లభించిన హైదరాబాద్లోని తన ఇంటి గోడపై నల్లటి మార్కర్తో కొన్ని మాటలు రాశారు. కొంతకాలంగా తనను చూసుకుంటున్న తన పనిమనిషికి తన సేవింగ్స్ మొత్తాన్ని అప్పగించమని ఆయన తన కుటుంబాన్ని కోరారు.
ఆయన చివరి సందేశం ఇలా ఉంది. "నా సేవింగ్స్ ఆమెకు ఇవ్వండి. ఆమెను ఇబ్బంది పెట్టవద్దు." అని ఆ గోడపై రాశారు. రంగనాథ్ సూసైడ్ నిర్ణయం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఎన్నడూ అధికారికంగా ధ్రువీకరించబడలేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ముందు రంగనాథ్.. బి దేవదాస్తో సహా కొందరు స్నేహితులకు "వీడ్కోలు" సందేశాలు కూడా పంపాడు.

రంగనాథ్ ఎవరు?
చెన్నైలో తిరుమల సుందర శ్రీ రంగనాథ్గా జన్మించిన రంగనాథ్ సినీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసేవారు. 1969లో దర్శకుడు బాపు తెరకెక్కించిన 'బుద్ధిమంతుడు' చిత్రంతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు . ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆయన 40కి పైగా చిత్రాలలో కథానాయకుడిగా నటించి, అనంతరం విలన్, సహాయ పాత్రలకు మారారు. 46 ఏళ్ల తన కెరీర్లో రంగనాథ్ 300కి పైగా సినిమాలలో, అనేక టెలివిజన్ సీరియల్స్లో నటించారు. జమీందారుగారి అమ్మాయి (1975), అమెరికా అమ్మాయి (1976), పంతులమ్మ (1977), తాయారమ్మ బంగారయ్య , 3 దీవారైన్ (2003), మన్మధుడు (2002), నిజం (2003) వంటి హిట్ చిత్రాలలో రంగనాథ్ అద్భుతమైన పాత్రలు అందరికీ గుర్తుంటాయి.
చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న సమయంలో రంగనాథ్ 2009లో తన భార్యను కోల్పోయారు. భార్యను కోల్పోయిన అనంతరం ఆయన చాలా కాలంగా డిప్రెషన్, ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఆ తర్వాతి సంవత్సరాలలో ఆయన తరచుగా ఆత్మహత్య గురించి మాట్లాడటం ప్రారంభించారని, కౌన్సెలింగ్కు కూడా వెళ్లారని ఆయన కూతురు నీరజ వెల్లడించారు. 2015 డిసెంబర్ 19న, మధ్యాహ్నం ఆయన పనిమనిషి మీనాక్షి రంగనాథ్ను చివరిసారిగా చూసింది. ఆమె రంగనాథ్కు భోజనం సిద్ధం చేసి వెళ్లిపోయింది. సాయంత్రం కొంతమంది వ్యక్తులు రంగనాథ్ను కలవడానికి, ఓ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చారు. అయితే లోపలి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు తమ కుటుంబంతో సమీపంలో నివసిస్తున్న నీరజకు ఈ విషయం తెలియజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. రంగనాథ్ లోపల చనిపోయి కనిపించాడు. రంగనాథ్ కుటుంబం ఆయన చివరి కోరికను గౌరవించింది. ఆయన అంత్యక్రియల అనంతరం ఆయన పిల్లలు ఆయన చివరి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుని, ఆయన పొదుపు మొత్తాన్ని మీనాక్షికి అప్పగించారు.













Click it and Unblock the Notifications