మళ్లీ థర్డ్ ఫ్రంట్ పాత్ర, ఢిల్లీలో చంద్రబాబు ఫోకస్

అవినీతిపై పోరాటం కొనసాగుతుందని సమావేశానంతరం ప్రకాష్ కారత్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అవినీతిపై మాట్లాడితే ప్రభుత్వం నోరు నొక్కుతోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తొమ్మిది పార్టీలు ఈ నెల 26వ తేదీన ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లును వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతిపై పార్లమెంటులో తమ వాదనలు వినిపించినా లాభం లేకపోవడంతో ఆందోళనలకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు. తాము మొదటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం సాగించామని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications