అరెస్టు అవకాశం, ఓదార్పునకు వైయస్ జగన్ నో బ్రేక్

కృష్ణా జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 26వ తేదీన ముగుస్తుంది. సిబిఐ అరెస్టు చేయవచ్చుననే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సమయానికి ఆయన ప్రజల మధ్య ఉండదలుచుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన చిత్తూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేయనున్నారు. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు సిబిఐ ఇప్పటి వరకు ఏ నాయకుడిని కూడా అరెస్టు చేయలేదు. అయితే, జగన్ విషయంలో సిబిఐ ఆ చర్యకు దిగేలా చూడాలని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు అనుకుంటున్నాయి. దానివల్ల ప్రజల సానుభూతిని పొందవచ్చుననేది వ్యూహంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications