హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజనపై తక్కువ మాట్లాడితే మంచిది: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. పత్రికలు మినహా మిగిలిన అన్ని రికార్డులు తన పాలన మెరుగ్గా ఉందని రుజువు చేస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆందోళనల వల్ల పరిశ్రమల విస్తరణ ఆగిపోయిన మాట వాస్తవమేనని ఆయన ఆంగీకరించారు. అయితే ఇలాంటి ఆందోళనల వల్ల ప్రభుత్వ చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. సమ్మెల కారణంగా రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

అత్యవసర సేవలు నిలిచి పోకుండా ఉండేందుకు మాత్రమే పలు శాఖలను ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చామని చెప్పారు. ఎస్మా చట్టం కొత్తగా తీసుకు వచ్చింది కాదన్నారు. ఎస్మా అంశంపై మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తోందని అన్నారు. సమ్మెలు, ఆందోళనల వల్ల పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

English summary
CM Kiran Kumar Reddy suggested that to talk very less on state divide issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X