హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రులపై చార్జిషీట్ వేయాలి: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: విద్యార్థుల బలిదానాలకు తెలంగాణ మంత్రులపై చార్జిషీట్ దాఖలు చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు వెనకడుగు వేయడం వల్లనే యువకుల బలిదానాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. హరీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం తమపై జారీ చేసిన హక్కుల ఉల్లంఘన నోటీసుకు అసెంబ్లీ కార్యదర్శికి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విధులకు హాజరైన మంత్రులు మనుషులా అని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంత్రులు ఇప్పుడు విద్యార్థి నాయకులు అరెస్టయినా మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. స్పీకర్ అన్నా, శాసనసభ అన్నా తమకు గౌరవం ఉందని, విద్యార్థుల బలిదానాలతో ఒత్తిడికి లోనయ్యామని ఆయన అన్నారు. రాజీనామాలు చేసే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. తాము రాజీనామాలు చేసినా స్పీకర్ కనీసం మాట్లాడకుండా రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

English summary
MLA from Telangana suspended from TDP Nagam Janardhan Reddy lashed out at Telangana Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X