జగన్ వెంట మిగిలింది 14 మంది ఎమ్మెల్యేలే?

అత్యవసరంగా సమాచారం అందించడం వల్ల దూరంగా ఉండడంతో మిగతావారు రాలేకపోయారని అంటున్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. హైదరాబాదులో అందుబాటులో ఉన్నవారు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అవసరమైతే రాజీనామాలు చేయడానికి సిద్ధమేనని జగన్ వర్గం శాసనసభ్యులు చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే పరిస్థితి లేదని శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. అవసరమైతే రాజీనామాలు చేస్తామని ఆమె చెప్పారు. సమావేశమైన శాసనసభ్యులతో కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు రేపు శనివారం గవర్నర్ నరసింహన్ను కలుసుకుంటున్నారు. అయితే, రాజీనామా లేఖలు అందించడానికి మాత్రం కాదని అంటున్నారు. జగన్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వారు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో వారున్నారు. మరింత మంది కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులను కూడగట్టి ప్రభుత్వం పడిపోయే విధంగా రాజీనామాలకు సిద్ధపడాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాజీనామాల యోచన మాత్రం వారిలో ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications