జగన్ వెంట మిగిలింది 14 మంది ఎమ్మెల్యేలే?

అత్యవసరంగా సమాచారం అందించడం వల్ల దూరంగా ఉండడంతో మిగతావారు రాలేకపోయారని అంటున్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. హైదరాబాదులో అందుబాటులో ఉన్నవారు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. అవసరమైతే రాజీనామాలు చేయడానికి సిద్ధమేనని జగన్ వర్గం శాసనసభ్యులు చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే పరిస్థితి లేదని శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. అవసరమైతే రాజీనామాలు చేస్తామని ఆమె చెప్పారు. సమావేశమైన శాసనసభ్యులతో కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు రేపు శనివారం గవర్నర్ నరసింహన్ను కలుసుకుంటున్నారు. అయితే, రాజీనామా లేఖలు అందించడానికి మాత్రం కాదని అంటున్నారు. జగన్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వారు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో వారున్నారు. మరింత మంది కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులను కూడగట్టి ప్రభుత్వం పడిపోయే విధంగా రాజీనామాలకు సిద్ధపడాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాజీనామాల యోచన మాత్రం వారిలో ఉంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications