హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ గగ్గోలు ఎందుకు పెడుతున్నారు?: రేవంత్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: చట్టం తన పని తాను చేసుకు పోవడం మొదలు పెట్టాక వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు గగ్గోలుపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. ఎబిసిడిలు తెలియక పోయినా జగన్, ఆయన భజనపరులు అసత్యాలు పలకడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి జగన్‌పై విచారణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుపై ఒత్తిడి తెచ్చారని అనడం న్యాయవ్యవస్థను అవమానపర్చడమే అని అన్నారు.

దోచుకున్న వారు ఎవరైనప్పటికి వారికి శిక్ష పడాలన్నదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ అన్నారు. జగన్ అక్రమాలలో నాటి మంత్రివర్గం విచారణకు సైతం టిడిపి డిమాండ్ చేస్తుందన్నారు. ఏలేరు కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని అన్నారు. చట్టం తన కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు దర్యాఫ్తుపై జగన్ వర్గం నేతలు ప్రశ్నించడం ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో న్యాయవ్యవస్థ నడుస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

English summary
TDP senior leader Revanth Reddy questioned YSRC party president YS Jaganmohan Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X