హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మొదటి ముద్దాయి: ఎమ్మార్‌పై రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలే అని ఆ పార్టీ నేత, సినీ నటి రోజా శుక్రవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల దృష్ట్యా వైయస్ జగన్‌కు ప్రజలలో మంచి ఆదరణ ఉందని అన్నారు. ఆయన భవిష్యత్తు ప్రజలే చూసుకుంటారని అన్నారు. జగన్ ఆస్తులపై, ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు, కార్యాలయాలలో సిబిఐ దాడులు రాజకీయ కుట్రలో భాగమే అని ఆమె ఆరోపించారు.

ఎమ్మార్ వ్యవహారంలో తొలి ముద్దాయి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని ఆమె ఆరోపించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సుప్రీం కోర్టు వెళ్లడం తప్పు కాదన్నారు. జగన్ పై రాజకీయ కుట్ర జరుగుతున్నందునే అప్పీలుకు వెళ్లారని అన్నారు.

English summary
Cine actor and YSRC party leader Roja said today that party chief YS Jagan future is in public hand. She accused that CBI searches is conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X