వైయస్సారే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు: సోమిరెడ్డి

దేశ చరిత్రలో ఇంత పెద్ద అవినీతి కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. జగన్ అవినీతి ఆస్తులను లెక్క వేయడానికి సీబీఐకి ఉన్న సిబ్బంది సైతం సరిపోవడం లేదన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు తెదేపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ జగన్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ను పచ్చి అవకాశవాదిగా అభివర్ణించారు. పరిటాల హత్య కేసులో జగన్ ఇంటికొచ్చి సీబీఐ విచారణ జరిపితే... ఆనాడు ఆ సంస్థ మంచిగా కనిపించిందా అని జగన్ను సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ అక్రమ ఆస్తులు వెలుగుతీస్తుంటే దాన్ని కుట్రగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మార్ కుంభకోణంలో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ విచారణలో తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాలమేరకే జగన్పై సీబీఐ విచారణ జరుపుతోంది తప్ప ప్రభుత్వాల చొరవ వల్ల కాదని తెలుగుదేశం పార్టీవిప్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీబీఐ సోదాలతో శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే కంగారుతోనే జగన్, అతని అనుచరులు తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడూ, ఆ తర్వాతా ఆయన అక్రమాలపై తమ పార్టీ పోరాటం చేసిందని, ఇప్పుడూ కొనసాగిస్తోందనే విషయం జగన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ వేల కోట్లరూపాయలు సంపాదించేందుకు వైఎస్ సహకరించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులపై సిటింగ్ జడ్జ్తో విచారణకు ఆదేశించాలని శాసనసభలో చంద్రబాబు సవాల్ చేసినా అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి స్పందించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications