వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత పద్మనాభస్వామి ఆరోగదిపై హైకోర్టుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Padmanabhaswamy Temple
తిరువనంతపురం: అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగను ఎట్టకేలకు తెరవాలనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల బృందం నిర్ణయించింది. ఆలయంలోని ఐదు నేలమాళిగలను ఇప్పటికే తెరిచారు. అయితే ఆరో నేలమాళిగకు నాగబంధం ఉన్న దృష్ట్యా తెరవకూడదని, తెరిస్తే అరిష్టం అనేది పలువురి వాదన. దీంతో ఈ ఆరో గదిని తెరిచే విషయం సుప్రీం కోర్టు తాను నియమించిన ఐదుగురు సభ్యుల బృందానికి అప్పగించింది. ఆ బృందం నేలమాళిగను తెరవడానికి నిర్ణయించింది.

ఆరో నేలమాళిగను తెరవకూడదా తెరవాలా అన్న అంశంపై ఇటీవల దేవాలయ సంబంధీకులు దైవప్రశ్నం నిర్వహించారు. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించారు. దైవప్రశ్నంలో ఆరో నేలమాళిగను తెరవకూడదని, తెరిస్తే అరిష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సంపద బహిర్గతం కావడంపై దేవుడు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. నాగబంధం ఉన్న ఆరో గది ఎంతో చైతన్యపూరితమైనదని అది తెరిస్తే అరిష్టాలు జరుగుతుందని దైవప్రశ్నంలో తేలింది. అయితే సుప్రీం కోర్టు బృందం మాత్రం తెరవడానికే నిర్ణయించింది. దీంతో దేవాలయ సంబంధీకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగది తెరిస్తే నష్టం ఉంటుందని చెబుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీం కోర్టు బృందం నిర్ణయంపై హైకోర్టు ఏం తీర్పు చెప్పనుందో చూడాలి.

English summary
Sixth Nelamaliga of Anantha Padmanabha Swamy temple case went to high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X