వేయి కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తా: చంద్రబాబు

విజయవాడ: తనకు కాంగ్రెసు నాయకులు వేయి కోట్ల రూపాయలు ఇస్తే తన అస్తులు మొత్తం రాసిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఆయన గురువారం అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఒకటి రెండు రోజుల్లో తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ వ్యవహారంలో తనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, తాను దోషిగా తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. తప్పుడు వార్తలు రాస్తే ప్రజలు నమ్మబోరని ఆయన సాక్షి దినపత్రికను ఉద్దేశించి అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, జీవితంలో తాను ఇప్పటి వరకూ ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు.

అవినీతి డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని, అవినీతిపై ప్రజల్లో చైతన్యం పెరిగితే అటువంటివారి ఆటలు సాగవని ఆయన అన్నారు. డబ్బులిచ్చి శాసనసభ్యులను కొంటున్నారని, అటువంటి వారిని ఎన్నికల్లో ఓడించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గనులు దోచేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రధాని మన్మోహన్ లాంటివారు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రతిపైసాకు ప్రభుత్వం లెక్కలు చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+