కృష్ణా జిల్లాలో చంద్రబాబు వర్సెస్ వైయస్ జగన్

ఒకే జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా రాజకీయ వాతావరం ఒక్కసారిగా వేడెక్కింది.
జగన్ పదిరోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న తన ఓదార్పు యాత్రలో చంద్రబాబు అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రెండెకరాల ఆసామి అన్ని ఆస్తులు ఎలా సంపాదించాలో తెలపాలని జగన్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కై తనను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే జగన్ టూర్ జిల్లాలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఓదార్పు పూర్తి కాకపోవడంతో కొనసాగుతోంది. కాగా సుప్రీం కోర్టులో చుక్కెదురయిన అనంతరం జగన్ ఉధృతి తగ్గినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు గురువారం మధ్యాహ్నం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా విజయవాడకు వెళ్లారు.
విజయవాడలో నాలుగు ప్రాంతాలలో అవినీతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు సైతం జగన్ అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. యువతరమే అవినీతికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిస్తున్నారు. ఇద్దరూ అవినీతి అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై జగన్, జగన్ అవినీతిపై చంద్రబాబు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, జగన్ టూర్ల కారణంగా టిడిపి, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తల్లో జోరు కనిపిస్తోంది.
-
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..!












Click it and Unblock the Notifications