Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కిరణ్, బొత్స మధ్య విభేదాలు

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల రాజీనామాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. రాజీనామాలను ఆమోదించాలని బొత్స సత్యనారాయణ ఉవ్విళ్లూరుతుండగా, కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదింపజేసి, ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. చిరంజీవిని వెంటేసుకుని ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి, సాధ్యమైనంత మేరకు కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించే అవకాశాన్ని వాడుకోవాలని ఆయన చూస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడానికి ఈ ఉప ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు.

బొత్స వ్యూహంలో భాగంగానే ప్రభుత్వ విప్ కొండ్రు మురళి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని కోరారు. తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భేటీ అనంతరం మురళి చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు అనుకూలంగా ఏ మాత్రం ఫలితం వచ్చినా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడానికి వీలుంటుందని బొత్స ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికలకు విముఖంగా ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా అంత మంచి పరిస్థితిలో లేదు. ఉప ఎన్నికల్లో ప్రజలకు కొత్తగా హామీలు ఇవ్వడానికి అది సహకరించడం లేదు. దాంతో సాధ్యమైనంత వరకు రాజీనామాలను ఆమోదించకుండా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను సామబేధదానదండోపాయాల ద్వారా తమ వైపు తిప్పుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వీరిరువురి మధ్య విభేదాలు జగన్ వర్గం శాసనసభ్యులకు కొంత ఊరటనిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+