ఎమ్మెల్సీకి రోశయ్య రాజీనామా: రేసులో డి శ్రీనివాస్

సామాజిక, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ఈ సీటు భర్తీ కోసం అధిష్టానం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనమండలిలో ఇప్పటి వరకు బిసిలలోని చేనేత వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ వర్గాల్లో అసంతృప్తి ఉంది. దీంతో ఆ వర్గం నుండి బూదాటి రాధాకృష్ణయ్యను ఎంపిక చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రోశయ్య ఆంధ్రా ప్రాంతం వ్యక్తి. రాధాకృష్ణయ్య సైతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో రాధాకృష్ణయ్య వైపే పార్టీ మొగ్గే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన ఈ సమయంలో తెలంగాణ వారికి ఇచ్చే అవకాశాలనూ కొట్టి పారేయలేము. మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పేరునూ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులను చల్లబర్చడానికి ఇటీవల దళిత వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. అలాగే బిసి వర్గానికి చెందిన శ్రీనివాస్కు ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. కిష్టారెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్ రావు తదితరుల పేర్లనూ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అత్యధికంగా ఉన్న బిసి ఓట్లు టిడిపి, జగన్ వైపు మళ్లకుండా చూసేందుకు ఆ వర్గాలకే అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications