వైయస్‌పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanarayana
హైదరాబాద్: వర్ధంతికి ఒక రోజు ముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ బొమ్మ పెట్టుకుని కాంగ్రెసు శాసనసభ్యులు గెలిచారని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అనడంపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. గెలిచినవారు వైయస్ బొమ్మ పెట్టుకుని గెలిస్తే, ఓడిపోయినవారి మాటేమిటని, దాదాపు 150 మంది దాకా కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారని, వీరి ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. తాను, తన లాంటి చాలా మందిమి 2004కు ముందు కూడా గెలిచామని, తమ సంగతేమిటని, తాము ఎవరి బొమ్మ పెట్టుకుని గెలిచామని ఆయన అన్నారు.

మెసెంజర్ ద్వారా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేస్తూ మెసెంజర్ ద్వారా లేఖలు పంపిస్తే ఎలా ఆమోదించేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను అధిష్టానానికి ఏ విధమైన లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకటిరెండు రోజుల్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవితో కలిసి తన జిల్లా పర్యటనలుంటాయని, ఆ వివరాలు రేపు వెల్లడిస్తానని ఆయన అన్నారు.

పార్టీ, ప్రభుత్వం పట్ల బాధ్యత పెరిగేలా తన తూర్పు గోదావరి జిల్లా పర్యటన సాగిందని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల మధ్య అక్కడక్కకడా సమన్వయ లోపం కనిపించిందని ఆయన అన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలతో కాంగ్రెసు కార్యకర్తల సమన్వయం సాధించాల్సి ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+