వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిరంజీవి సూచన

Chiranjeevi
హైదరాబాద్: రాజీనామాల విషయంలో పునరాలోచన చేయాలని కాంగ్రెసు నాయకుడు, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు సూచించారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన గురువారం ప్రజారాజ్యం పార్టీకి వచ్చారు. బావమరిది అల్లు అరవింద్, తదితరులతో కలిసి ఆయన వినాయక పూజలు నిర్వహించారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యుల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కాంగ్రెసులో తన స్థానమేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తాను పదవులకు ఆశపడడం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయానికి వచ్చే నెలలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే తన జన్మదినం నాటికి తన 150వ సినిమా ప్రజల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాను వినాయకుడిని కోరినట్లు ఆయన తెలిపారు. రైతులకు మేలు జరగాలని వేడుకున్నట్లు ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+