కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం, అడ్డుకున్న స్త్రీలు

మహబూబ్ నగర్ జిల్లాలోను స్థానిక ప్రజలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావును ఘెరావ్ చేశారు. రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ కోసం అందరూ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలోని సకల జనుల సమ్మెలో తాము కూడా పాల్గొంటామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. తాము సమ్మెలో పాల్గొంటే అంతా అంధకారంలో ఉంటుందన్నారు. ఈ నెల 19 నుండి అత్యవసర సేవలు మినహా సమ్మెలో పాల్గొంటామని చెప్పారు. సుమారు 25వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications